onteru: సర్వే చేసి ప్రతాప్ రెడ్డి గెలుస్తున్నాడని చెప్పే ధైర్యమున్న మీడియా ఇక్కడుందా?: వంటేరు

  • టీఆర్ఎస్ నేతలను చూసి మీడియా భయపడుతోంది  
  • ఏమైపోతుందోనని మీడియా యాజమాన్యాలకు భయం
  • ఇక్కడ దమ్మున్న సర్వేలు, దమ్మున్న మీడియా లేదు 

కేసీఆర్ ప్రభుత్వంలో నాయకులు ఫోన్లలో మాట్లాడుకోవాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయిని, నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సర్వే చేసి ప్రతాప్ రెడ్డి గెలుస్తున్నాడని చెప్పే ధైర్యమున్న మీడియా ఇక్కడుందా? అని ప్రశ్నించారు. ఎందుకంటే, వాళ్లను చూసి మీడియా భయపడుతోందని అన్నారు.

ఏమైపోతుందోనన్న భయంలో మీడియా యాజమాన్యాలు ఉన్నాయని, ఈ విషయాలను రాసే పత్రికలు, చెప్పే మీడియా లేదని విమర్శించారు. దమ్మున్న సర్వేలు, దమ్మున్న మీడియా లేదని, ‘నాకు దమ్ముండి చెబుతున్నా.. పక్కా, నేను గెలుస్తున్నా’ అని ధీమా వ్యక్తం చేశారు.  ప్రింటెడ్ స్లిప్స్ ను కౌంట్ చేయాలని అడిగే హక్కు తనకు ఉందని, ఈ దిశగా మీడియా కూడా ప్రసారం చేయాలని కోరారు.

More Telugu News