prajakutami: ప్రజాకూటమి 70-80 స్థానాలు తప్పక గెలుస్తుంది: ఉత్తమ్

  • డిసెంబర్ 12న మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది
  • చాలా విషయాల్లో ఎన్నికల సంఘం విఫలమైంది
  • ఈవీఎంలు మారవచ్చనే అనుమానాలూ ఉన్నాయి

ప్రజాకూటమి 70 నుంచి 80 స్థానాలు తప్పక గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో ప్రజాకూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, డిసెంబర్ 12న ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అన్నారు. చాలా విషయాల్లో ఎన్నికల సంఘం విఫలమైందని, ఈవీఎంలు మారవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల్లోకి అధికారులు కూడా వెళ్లకూడదని, ఆ రూమ్ లను కార్యకర్తలు, నేతలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.

More Telugu News