rashmi: వెంటనే నా ఫ్లెక్సీ తొలగించండి: అసహనాన్ని వ్యక్తం చేసిన యాంకర్ రష్మీ

  • యూత్ లో రష్మీ కి మంచి క్రేజ్ 
  • నన్ను ఎవరూ సంప్రదించలేదు 
  • జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదు

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ .. రష్మీ ఎంతో పాప్యులర్ అయ్యారు. ఈ క్రేజ్ కారణంగా ఈ ఇద్దరూ మరికొన్ని షోలలోను సందడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి తిరుపతిలో ప్రత్యక్షమైంది. క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి గాను, తిరుపతిలో కొందరు ఈ నెల 9వ తేదీన 10k రన్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ .. రష్మీ పాల్గొననున్నట్టు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై రష్మీ స్పందించింది. "ఈ ఈవెంట్ కి సంబంధించిన నిర్వాహకులు ఎవరూ ఇంతవరకూ నన్ను సంప్రదించలేదు. ఈ ఈవెంట్ కి నేను రానున్నట్టుగా జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నా అనుమతి లేకుండా నా ఫోటోని ఎలా ఉపయోగిస్తారు? నిర్వాహకులు వెంటనే నా ఫ్లెక్సీని తొలగించాలి" అంటూ ఆమె సూచించింది.        

More Telugu News