Tirumala: ఏడుకొండలూ దిగి వచ్చిన శ్రీవారి కాసుల హారం... వైభవంగా ఊరేగింపు!

  • తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
  • నేడు గజవాహన సేవ
  • అమ్మకు అలంకరణలో స్వామి వారి హారం

ప్రతి సంవత్సరమూ జరిగే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో, గజవాహన సేవలో భాగంగా అమ్మకు అలంకరించే స్వామివారి కాసుల హారం ఏడు కొండలూ దిగివచ్చింది. ఈ కార్యక్రమాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. నిత్యమూ స్వామి మెడలో ఉండే కాసుల హారం, ఈ ఒక్కరోజే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అలంకరిస్తారు.

తిరుమాడ వీధుల్లో ఊరేగింపు అనంతరం తిరుమల నుంచి తిరుచానూరుకు హారాన్ని తరలించారు. నేటి సాయంత్రం పద్మావతీ దేవికి జరిగే గజ వాహన సేవ సమయంలో ఈ హారాన్ని అలంకరిస్తారు. తిరుమలలో గరుడోత్సవానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, తిరుచానూరులో గజవాహన సేవకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి, అమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ.

More Telugu News