RaiLakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రాయ్ లక్ష్మికి బోర్ కొట్టేసిందట 
  • ఎన్టీఆర్ బయోపిక్ లో రాఘవేంద్రరావు
  • 'సాహో' యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ

*  సినిమాల్లో తనకు ఇటీవల బోర్ కొట్టేసిందని అంటోంది ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి. 'వరుసగా అన్నీ ఒకే తరహా సినిమాలు చేసి చేసీ బోర్ కొట్టేసింది. చిరాకు వచ్చేసింది. అందుకే ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటేనే ఒప్పుకుంటున్నాను' అని చెప్పింది.
*  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ 'కథానాయకుడు'లో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పాత్రను కూడా చూపిస్తున్నారు. ఈ పాత్రలో రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి నటిస్తున్నాడట.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రం మూడో షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు.  

More Telugu News