Telangana: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాసిందే లగడపాటి సర్వే: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • కూటమికి అనుకూలంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయి
  • లగడపాటిని టీడీపీ వాళ్లు భుజాలకు ఎత్తుకున్నారు
  • లగడపాటి తన క్రెడిబులిటీ పోగొట్టుకున్నారు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాసిన సర్వేనే లగడపాటి సర్వే అని, ఇది వాస్తవమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాకూటమికి అనుకూలంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయని విమర్శించారు. లగడపాటిని టీడీపీ వాళ్లు భుజాలకు ఎత్తుకుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో లగడపాటి సర్వే సక్సెస్ కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీని, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈ సర్వే ఇచ్చిన లగడపాటి తన క్రెడిబులిటీ పోగొట్టుకున్నారని అన్నారు.

తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, హంగ్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ కానీ, ప్రజా కూటమి కానీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని చెప్పిన ఆయన, ఈ ఎన్నికల్లో పది సీట్లలో తాము గెలవబోతున్నామని ధీమాగా చెప్పారు. 

More Telugu News