Hyderabad: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

  • 119 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్  
  • 106 నియోజకవర్గాల్లో 5 గంటలకు ముగిసిన పోలింగ్
  • 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒక గంట ముందుగానే

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు సాయంత్రం  ఐదు గంటలకు 106 నియోజకవర్గాల్లో, ఒక గంట ముందుగానే 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఐదు గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 5 గంటల తర్వాత వచ్చే ఓటర్లను బూత్ లోకి అనుమతించరు.
  

More Telugu News