nani: నాని సరసన 'పెళ్లి చూపులు' హీరోయిన్

  • విక్రమ్ కుమార్ తో నాని మూవీ 
  • ఫిబ్రవరి 19 నుంచి షూటింగ్ 
  • 'కేశవ' తరువాత రీతూ వర్మ సినిమా ఇదే

'పెళ్లి చూపులు' సినిమాతో కథానాయికగా రీతువర్మ మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో ఇటు యూత్ లోను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను రీతూవర్మ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె చేసిన 'కేశవ' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అదే సమయంలో ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ కారణంగా ఆమె ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయింది.

మళ్లీ ఇప్పుడు ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా, ఫిబ్రవరి 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

More Telugu News