Nalgonda District: పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలైన్‌లోనే గుండెపోటుతో కుప్పకూలిన వృద్ధుడు

  • ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి
  • నల్గొండ జిల్లాలో ఘటన
  • చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన నర్సింహగా గుర్తింపు

పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్న ఓ వృద్ధుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన నర్సింహ గ్రామంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు వచ్చాడు. క్యూలో నిల్చుని వేచి ఉండగా గుండెపోటు వచ్చి పడిపోయాడు. స్థానికులు ఈ హఠాత్పరిణామంతో దిగ్భ్రమకు గురై హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే మృతి చెందాడు. ఈ ఘటనతో నర్సింహ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

More Telugu News