Chiranjeevi: గతంలోలా ముందుకెళ్లి వివాదం కొని తెచ్చుకోలేదు... ఓపికగా వేచి చూస్తున్న చిరంజీవి... వీడియో!

  • గత ఎన్నికల్లో క్యూలైన్ ను పట్టించుకోని చిరంజీవి
  • ఓ పౌరుడి ఆగ్రహం
  • నేడు ఓపికతో నిలిచి ఓటేసిన చిరంజీవి

గత ఎన్నికల్లో మాదిరిగా వివాదం కొని తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు మెగాస్టార్ చిరంజీవి. పోయిన సారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చి, క్యూలైన్ ఉన్నా, ముందుకు వెళ్లి, ఓ పౌరుడి ఆగ్రహానికి గురైన చిరంజీవి, ఈ సారి మాత్రం ఎంతో ఓపికగా క్యూ లైన్ లో వేచి ఉండి, తనవంతు వచ్చిన తరువాతనే లోనికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూబ్లీహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన, లైన్ లో వెయిట్ చేస్తున్న వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News