akhil: శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసుకున్న 'మిస్టర్ మజ్ను'

  • తెరపైకి మరో రొమాంటిక్ లవ్ స్టోరీ 
  • ప్రత్యేక ఆకర్షణగా తమన్ సంగీతం 
  • జనవరి చివరిలో విడుదల

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమా చేశాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను జనవరి 3వ వారంలో గానీ .. 4వ వారంలో గాని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైపోయింది. ఇక శాటిలైట్ రైట్స్ కోసం కొన్ని ఛానల్స్ పోటీపడ్డాయట. చివరికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానల్ వారు దక్కించుకున్నారు.

డిజిటల్ .. శాటిలైట్ రైట్స్ కి గాను 5 కోట్లు చెల్లించినట్టు సమాచారం. గతంలో 'అఖిల్'.. 'హలో' సినిమాల శాటిలైట్ రైట్స్ ను కూడా ఈ ఛానల్ వారే దక్కించుకున్నారు. 'తొలిప్రేమ'తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి నుంచి వస్తోన్న మరో రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి వుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. అఖిల్ .. నిధి అగర్వాల్ జోడీ చూడముచ్చటగా ఉండటంతో, ఈ సినిమాపై యూత్ లో మరింత క్రేజ్ పెరిగిపోయింది.     

More Telugu News