Nizamabad District: క్యూలైన్ చాలా పెద్దదే... ఓటేసేందుకు వేచి చూస్తున్న ఎంపీ కవిత!

  • పోతంగల్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన కవిత
  • అప్పటికే క్యూలైన్లో చాలా మంది ఓటర్లు
  • తనవంతు కోసం ఎదురుచూస్తున్న నిజామాబాద్ ఎంపీ

కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఓటేసేందుకు చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నారు. ఈ ఉదయం నిజామాబాద్ పరిధిలోని పోతంగల్ లో ఏర్పాటు చేసిన 177వ పోలింగ్ బూత్ వద్దకు ఆమె వచ్చేసరికే చాలా మంది ఓటర్లు క్యూలైన్లో వేచివున్నారు. దీంతో ఆమె లైన్ లో చాలాసేపటి నుంచి వేచిచూస్తున్నారు. ఈ ఉదయం 9.55 గంటల సమయంలో తీసిన చిత్రమిది. క్యూలైన్లో నిలబడి తన వంతు కోసం వేచిచూస్తున్న కవితను మీరూ చూడవచ్చు.




More Telugu News