governer narasimhan: ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్‌ దంపతులు

  • భార్యతో కలిసి ఖైరతాబాద్‌ మక్తా పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన నరసింహన్‌
  • పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు
  • ముఖ్యమైన ఓటు కోసం ఓ గంట సమయం కేటాయించాలని సూచన

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ శుక్రవారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని మక్తా పోలింగ్‌ కేంద్రానికి భార్యతో కలిసి వచ్చిన ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌరులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓ గంట సమయాన్ని కేటాయించాలని, ముఖ్యంగా యువత తమ బాధ్యతను నెరవేర్చాలని సూచించారు. వీకెండ్‌ సెలవులు కలిసి వస్తున్నందున ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రెండు రోజులపాటు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని చమత్కరించారు.

More Telugu News