Gutta Jwala: గుత్తా జ్వాల పేరు గల్లంతు... ఓటేసేందుకు వచ్చి ఉసూరుమంటూ వెనక్కి!

  • బంజారాహిల్స్ పోలింగ్ కేంద్రానికి వచ్చిన గుత్తా జ్వాల
  • ఓటర్ల జాబితాలో పేరు లేదని చెప్పిన అధికారులు
  • గత ఎన్నికల్లో ఓటు వేశానన్న జ్వాల

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది. ఈ ఉదయం బంజారాహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి ఆమె రాగా, జాబితాలో పేరు లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆమె ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదో, ఏ కారణంతో తన పేరును తొలగించారో తెలియదని ఆమె వ్యాఖ్యానించింది.

కాగా, బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల వ్యవధిలో తెలంగాణలో 10 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తున్నామని, ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు కొత్త ఈవీఎంలను, సాంకేతిక నిపుణులను పంపించామని అధికారులు వెల్లడించారు.

More Telugu News