Aleru: మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

  • ఆలేరు నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మోత్కుపల్లి
  • అకస్మాత్తుగా పడిపోయిన రక్తపోటు
  • భువనగిరి ఆసుపత్రిలో చికిత్స

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ప్రస్తుత ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరఫున పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు ఈ తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన భువనగిరిలోని ఏరియా ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మోత్కుపల్లి అనుచరులు, అభిమానులు, బీఎల్ఎఫ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న విషయమై ఆసుపత్రి వైద్యుల నుంచి సమాచారం వెలువడాల్సివుంది.

More Telugu News