Nalgonda District: మిర్యాలగూడలో రోడ్డు పక్కన నాలుగు లక్షలు లభ్యం!

  • ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్న సొమ్ము
  • రోడ్డుపక్కన పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • ‘కాంగ్రెస్’ కండువా కప్పుకున్న వ్యక్తి నుంచి నగదు స్వాధీనం

ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్న సొమ్మును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపక్కన పడేసిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నట్టు సమాచారం.

కాగా, స్థానిక ఈదుల్ గూడ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఓ వ్యక్తి నుంచి రూ.47 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న సొమ్ముకు సంబంధించి ఎటువంటి ఆధారాలు అతను చూపించలేకపోయినట్టు పోలీసులు చెప్పారు.

More Telugu News