yash: రాజమౌళి ముఖ్య అతిథిగా 'కేజీఎఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • యశ్ కథానాయకుడిగా 'కేజీఎఫ్'
  • ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  •  21వ తేదీన సినిమా విడుదల  

కన్నడ స్టార్ యశ్ హీరోగా 'కేజీఎఫ్' రూపొందింది. 1970 నాటి కథా నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. గోల్డ్ మైన్స్ లో పనిచేసే కార్మికుల జీవితంలోని కన్నీటి కోణాన్ని ఆవిష్కరించే ఈ సినిమాకి విజయ్ కిరంగదూర్ నిర్మాతగా వ్యవహరించారు. కన్నడతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోనుంది. హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ఈ వేడుకకి వేదిక కానుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి మొదలయ్యే ఈ వేడుకకి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని నిర్మాత తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాజమౌళి ఈ వేడుకకి వస్తుండటం ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశమని చెప్పుకుంటున్నారు.  

More Telugu News