konda murali: ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది: కొండా మురళి

  • ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారు
  • సిగ్గు లేకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారు
  • అన్ని హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది

టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కొండా మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరైన పాలన అందిస్తారనే భావనతో కేసీఆర్ కు ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే, వారి నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని విమర్శించారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుందని చెప్పారు.

 గ్రామాలను ఏ మాత్రం అభివృద్ధి చేయలేని చల్లా ధర్మారెడ్డిని ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సిగ్గు లేకుండా కాపీ కొట్టారని... అయినా ఆ పార్టీని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని... ప్రజల్లో కూడా ఆ నమ్మకం ఉందని తెలిపారు. కొండా సురేఖను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పరకాలలో నిన్న మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News