kcr: కేసీఆరే మళ్లీ సీఎం కావాలంటూ నాలుక కోసుకున్న ఆంధ్రా యువకుడు!

  • హైదారాబాద్ లోని ఓ ఆలయంలో సంఘటన
  • నాలుక కోసుకుని హుండీలో వేసిన వైనం
  • వెంటనే ఆసుపత్రికి తరలించి బాధితుడికి చికిత్స

తన ప్రేమ ఫలించాలనో, దేవుడు ప్రత్యక్షం కావాలనో తమ నాలుకలు కోసుకుని మొక్కు తీర్చుకున్న సంఘటనలు గతంలో విన్నాం. తాజాగా, తెలంగాణకు కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఓ ఆంధ్రా యువకుడు తన నాలుకను కోసుకున్నాడు.

హైదారాబాద్, బంజారాహిల్స్ లోని ఓ ఆలయంలో సదరు యువకుడు తన నాలుక కోసుకుని కానుకగా హుండీలో వేశాడు. దీంతో, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడిని అక్కడి వారు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడిని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ గా గుర్తించారు. 

More Telugu News