team india: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. వివరాలు!

  • అడిలైడ్ లో రేపు తొలి టెస్టు ప్రారంభం
  • రోహిత్ శర్మ, అశ్విన్ లకు స్థానం
  • జడేజా, ఉమేష్ యాదవ్ లకు మొండిచేయి

ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య రేపు అడిలైడ్ లో తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో, ఈ మ్యాచ్ కు 12 మందితో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టులో రోహిత్ శర్మకు స్థానం కల్పించిన బీసీసీఐ.. రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ లను పక్కన పెట్టింది. ఏపీకి చెందిన బ్యాట్స్ మెన్ హనుమ విహారికి 12 మందిలో చోటు దక్కడం విశేషం. తుది జట్టులో కేవలం ఒక స్పిన్నర్ కు మాత్రమే అవకాశం దక్కింది. కుల్దీప్ స్థానంలో అశ్విన్ ను ఎంపిక చేసింది. ఆరో స్థానం కోసం రోహిత్ శర్మ, హనుమ విహారిల మధ్య పోటీ ఉంది.

తొలి టెస్టుకు జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా.

More Telugu News