KTR: పేడిమూతి బోడి లింగానివి.. మెలేసేందుకు కేటీఆర్ కు మీసం ఎక్కడుంది?: రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • ఎవడు  మీసం మెలేస్తే ఈ రాష్ట్రం కదులుతుందో చూద్దాం
  • కొడంగల్ లో నన్ను ఓడిస్తారట!
  • దమ్ముంటే.. కొడంగల్ అభివృద్ధిపై చర్చిస్తారా?

కొడంగల్ సభలో తన పేరు ఉచ్చరించడానికి కూడా సీఎం కేసీఆర్ భయపడ్డారని, ఈ నియోజకవర్గంలో ఇక తనను ఓడిస్తారని సవాల్ విసురుతున్నారని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. కొడంగల్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనను ఓడిస్తానని కేటీఆర్ కూడా సవాల్ విసురుతున్నారని అన్నారు. ఈ సవాళ్లు సరే, కొడంగల్ అభివృద్ధి లేదా రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించేందుకు దమ్ముంటే రావాలని, అప్పుడు ఎదురెదురుగా సవాళ్లు విసురుకుందామని అన్నారు.

ఎవరు మగాడో, మొనగాడో, మడమ తిప్పనోడో, ఎవడు  మీసం మెలేస్తే ఈ రాష్ట్రం కదులుతుందో చూద్దామని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అయినా, మీసం మెలేసేందుకు కేటీఆర్ కు ఎక్కడుంది? ‘పేడి మూతి బోడి లింగానివి. నువ్వు ఆడవో, మాడవో తెలియదు. మీసం మెలేయాల్సింది ఇట్లా’ అంటూ రేవంత్ రెడ్డి తన మీసం మెలేసి చూపించారు.

‘రా బిడ్డ.. నేను చెబుతున్నా.. నెలరోజులు టైమిస్తా మీసాలు పెంచుకుని రా, లేకపోతే, దుబాయ్ పోయి పెట్టుడు జుట్టు నెత్తి మీద పెట్టించుకొచ్చుకున్నావు కదా! మీసాలు మొలవకపోతే, ఎవని వన్నా ఉంటే పెట్టుకుని రా.. అనుకుంటున్నావేమో బిడ్డా కేటీఆర్..  చుట్టుపక్కల సినిమాలోళ్లు ఉన్నారు, సినిమా గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.. గెస్ట్ హౌస్ ల్లో మాదిరి మొనగాడి మాటలు మాట్లాడతానని.. నీ సంగతి చూస్తా’ అని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News