mancherial: పైపుల్లో తరలిస్తున్న డబ్బు పట్టివేత.. టీఆర్ఎస్ అభ్యర్థికి చెందినదిగా గుర్తింపు

  • మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో పోలీసుల తనిఖీలు
  • పీవీసీ పైపులో రూ.50 లక్షల నగదు పట్టివేత
  • డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

7వ తేదీన తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడుతోంది. ఈ అక్రమాలకు పాల్పడుతున్నవారు... కొత్తకొత్త మార్గాల్లో నగదును తరలిస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీవీసీ పైపులను తరలిస్తున్న ఓ ట్రాలీ అటువైపు నుంచి వెళ్తోంది. అయితే, ఓ పైపుకు చివర మూసివేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దాన్ని తనిఖీ చేయగా, పైపు లోపల రూ. 50 లక్షల నగదు బయటపడింది. ఈ నగదు టీఆర్ఎస్ అభ్యర్థికి చెందినదిగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నగదును తరలిస్తున్న ఓదేలు, బాల్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

More Telugu News