Janagama: కారులో రూ. 6 కోట్లు... జనగామలో తీవ్ర కలకలం!

  • పెంబర్తి వద్ద పోలీసుల తనిఖీలు
  • స్విఫ్ట్ కారులో డబ్బు తరలింపు
  • స్వాధీనం చేసుకున్న పోలీసులు

జనగామ జిల్లాలో ఓ కారులో తరలిస్తున్న రూ. 6 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర కలకలం చెలరేగింది. పెంబర్తి సమీపంలో చెక్ పోస్టును ఏర్పాటు చేసుకున్న పోలీసులు, తనిఖీలు సాగిస్తున్న వేళ, అటుగా వచ్చిన మారుతి స్విఫ్ట్ 'ఏపీ 37 సీకే 4985'ను తనిఖీ చేయగా, ఏకంగా రూ. 6 కోట్లు అందులో కనిపించాయి. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ఈ కారు వెళుతుండగా, అందులో ప్రయాణిస్తున్న వారు తరలిస్తున్న డబ్బుకు సరైన లెక్క చూపించక పోవడంతో, దాన్ని స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్ చేశారు. డబ్బును జనగామ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ కారు స్థానిక టీఆర్ఎస్ నాయకునిదని తెలుస్తోంది.

More Telugu News