tjs: ఒకే కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయింది!: టీజేఎస్ అధినేత కోదండరామ్

  • తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరో తెచ్చిపెట్టింది కాదు
  • ఓ కుటుంబం కోసం ఈ రాష్ట్రాన్ని ఇవ్వలేదు
  • తెలంగాణలో నియంతపాలన అంతం కావాలి

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరో తెచ్చిపెట్టింది కాదని, ఓ కుటుంబం కోసం ఈ రాష్ట్రాన్ని ఇవ్వలేదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తాండూరులో నిర్వహించిన ప్రజాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఒకే కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయిందని, తెలంగాణలో నియంతపాలన అంతం కావాలని అన్నారు.

 తాండూరు ఇప్పటికీ అభివృద్ధి కాలేదన్న కోదండరామ్, తమ కూటమి అధికారంలోకొస్తే జిల్లా కూర్పులు, జోన్ల కూర్పులు చేస్తామని చెప్పారు. జోన్ మార్పు కోసం వికారాబాద్ ప్రజలు చేస్తున్న పోరాటాన్ని పరిశీలిస్తామని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తామని హామీ ఇచ్చారు.  టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

More Telugu News