cm yogi: నాడు నిజాం నవాబ్ పారిపోయినట్టు ఒవైసీ పారిపోవడం ఖాయం: యూపీ సీఎం యోగి

  • మేము అధికారంలోకొస్తే ఒవైసీ పారిపోతారు
  • నేను కచ్చితంగా హామీ ఇస్తా
  • కులం, మతం ఆధారంగా మా పాలన సాగించట్లేదు

తెలంగాణలో బీజేపీ కనుక అధికారంలోకొస్తే.. నాడు హైదరాబాద్ నుంచి నిజాం నవాబు పారిపోయినట్టుగా ఇక్కడి నుంచి ఒవైసీ కూడా పారిపోవడం ఖాయమని, ఈ విషయంలో తాను కచ్చితంగా హామీ ఇస్తానని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కులం, మతం ఆధారంగా బీజేపీ పాలన సాగించడం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కులాలు, మతాలను విభజించి పరిపాలన సాగిస్తున్నాయని, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం ఆ పార్టీలు ఎన్నికల వరాలను కురిపిస్తున్నాయని విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని, రామరాజ్యం పరిపాలన తీసుకొచ్చేంది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి రాజేశ్వర్ రావు దేశ్ పాండేకు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు.

More Telugu News