assam: అసోంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో పేలుడు..పలువురికి గాయాలు

  • గువాహటి - తేజ్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రమాదం
  • ఓ బోగీలో పేలుడు..11 మందికి పైగా గాయాలు
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు

అసోంలోని ఉదల్ గురి జిల్లాలో గువాహటి- తేజ్ పూర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో ప్రమాదం సంభవించింది. ఓ బోగీలో పేలుడు సంభవించడంతో 11 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డట్టు సమాచారం. హరిసింగా రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News