Rajamouli: రాజమౌళి మల్టీస్టారర్‌లో ప్రియమణి!

  • ప్రముఖంగా కీర్తి సురేష్, రష్మిక పేర్లు
  • ప్రియమణిని సంప్రదించిన రాజమౌళి
  • 12-12-12న కీలక ప్రకటన

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో తెరకెక్కుతోందని మాత్రమే మనకు తెలుసు. కథానాయికల పేర్లు కూడా ఇప్పటి వరకూ వెల్లడి కాలేదు. దీనికి సంబంధించి కీర్తి సురేష్, రష్మిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా ఓ కీలక పాత్రకు ప్రియమణిని రాజమౌళి సంప్రదించారని సమాచారం. ఇప్పటికే మేజిక్ డేట్ 12-12-12న కీలక ప్రకటన ఉంటుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే నటీనటుల గురించి ఆ రోజున రాజమౌళి వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News