modi: రాహుల్ పై మంత్రి రవిశంకర్ ఘాటు వ్యాఖ్యలు!

  • రాజకీయ ప్రయోజనాల కోసమే హిందువునంటున్నారు
  • ప్రయోజనాల మేరకు రాహుల్ విశ్వాసాలు మారతాయి 
  • రాహుల్ ఓ ‘అయోమయం గాంధీ’

ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి హిందువు? అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తాను హిందువునని చెప్పుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాలను అనుసరించి ఆయన హిందూ విశ్వాసాలు మారుతుంటాయని విమర్శించిన రవిశంకర్, రాహుల్ ని ‘అయోమయం గాంధీ’గా అభివర్ణించారు.

కాగా, అంతకుముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీకి హిందూత్వ గురించి ఏమి తెలుసని ప్రశ్నించారు. హిందువునని చెప్పుకునే మోదీ దాని మూలాలను అర్థం చేసుకోలేదని, ఆయన ఏ రకమైన హిందువు? అని రాహుల్ ప్రశ్నించారు.

More Telugu News