rajani: 'పెట్టా' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది

  • కార్తిక్ సుబ్బరాజు నుంచి 'పెట్టా'
  • సోమవారం సాయంత్రం ఫస్టు సింగిల్ 
  • జనవరి 11వ తేదీన విడుదల

తమిళ యువ దర్శకులలో కార్తీక్ సుబ్బరాజ్ కి మంచి క్రేజ్ వుంది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుని, వాటిని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. ఆయన తాజా చిత్రంగా 'పెట్టా' రూపొందింది. రజనీకాంత్ కథానాయకుడిగా నిర్మితమైన ఈ సినిమాకి, అనిరుథ్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను సోమవారం రోజున సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఫస్టు సింగిల్ తోనే అందరిలో ఆసక్తిని పెంచేలా చూస్తున్నారు. ఈ సినిమాలో రజనీ సరసన సిమ్రాన్ నటించగా, త్రిష .. విజయ్ సేతుపతి .. నవాజుద్దీన్ సిద్ధిఖీ .. బాబీ సింహా ముఖ్యమైన పాత్రలను పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా, జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజున విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.   

More Telugu News