Telangana: మంత్రి కేటీఆర్ ను కలుసుకున్న సైనా-కశ్యప్.. వివాహ రిసెప్షన్ కు రావాలని ఆహ్వానం!

  • మంత్రిని కలుసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు
  • తెలంగాణలో క్రీడల అభివృద్ధిపై చర్చ
  • డిసెంబర్ 16న పెళ్లి రిసెప్షన్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 16న నోవాటెల్ లో సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. తాను తప్పకుండా వస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ట్విట్టర్ లో సైనా స్పందిస్తూ..‘మంత్రి కేటీఆర్ సార్ తో సమావేశం అద్భుతంగా సాగింది. తెలంగాణలో క్రీడల అభివృద్ధిపై చర్చించాం. మీరు మా పెళ్లి రిసెప్షన్ కు హాజరవుతారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేసింది.

More Telugu News