Mumbai: బాలుడిని లైంగికంగా లొంగదీసుకుని వివాహం చేసుకున్న మహిళ.. జైలుకు తరలింపు

  • బాలుడి తల్లి ఫిర్యాదు
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • జైలుకు తరలించిన పోలీసులు

17 ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకున్న 22 ఏళ్ల మహిళ పోక్సో చట్టం కింద జైలు పాలైంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం తమ ఇంట్లోనే ఉన్న మహిళ తమ కుమారుడిని లైంగికంగా లొంగ దీసుకుని వివాహం చేసుకుందని ముంబైకి చెందిన బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితురాలి నుంచి ప్రమాదం ఉందని గ్రహించి ఆమెను ఇంట్లో నుంచి పంపివేశామని.. కానీ కొద్దిరోజులకే తమ కుమారుడు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. అప్పటికే నిందితురాలికి రెండు సార్లు విడాకులు అయ్యాయని బాలుడి తల్లి పేర్కొంది.

నిందితురాలు బాలుడిని ఈ నెల తొలివారంలో వివాహం చేసుకుంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.

More Telugu News