Warangal Rural District: ప్రజాకూటమి నేతలపై తేనెటీగల దాడి!

  • వరంగల్ జిల్లా నల్లబెల్లి వద్ద సంఘటన
  • మామిడి తోటలో భోజనాలు చేస్తుండగా తేనెటీగల దాడి
  • పలువురికి స్వల్ప గాయాలు

వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రజాకూటమి నేతలపై తేనెటీగలు దాడి చేశాయి. వర్ధన్నపేట మండలం నల్లబెల్లి వద్ద ప్రచారం నిర్వహించిన అనంతరం, అక్కడి మామిడి తోటలో భోజనాలు చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కాంగ్రెస్ నేత కొండేటి శ్రీధర్ సహా పలువురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News