Bollywood: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్యకు కేన్సర్.. ప్రకటించిన జంట!

  • ఇన్ స్టాగ్రామ్ లో వివరాలు వెల్లడించిన తహిరా
  • కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నానని వెల్లడి
  • ఆందోళన చెందవద్దని స్నేహితులు, బంధువులకు సూచన

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా కుటుంబంలో విషాద పరిస్థితి నెలకొంది. తనకు కేన్సర్ సోకిందని ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ ప్రకటించింది. ఈ విషయం ఇతరుల ద్వారా తెలుసుకుని తమ బంధువులు, స్నేహితులు ఆందోళన చెందకుండా ఉండేందుకే ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తహిరా వెల్లడించింది. తాను జీవితంలో కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆమె పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.

‘నేను మొద‌టి సారి పరీక్ష చేయించుకున్న‌ప్పుడు రిపోర్టులో జీరో అని వ‌చ్చింది. డాక్ట‌ర్ స‌ల‌హాలు విని ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా. అప్‌గ్రేడెడ్ వ‌ర్షెన్ ద్వారా తెలుసుకుంటే అది ముదిరిపోయింద‌ని అర్ధ‌మైంది. ప్ర‌స్తుతం స్టేజ్ 1లో ఉన్నాను. ఇప్ప‌టివరకూ కిమో థెరపీ ఆరు సెష‌న్స్ పూర్తి కాగా, ఇంకో ఆరు మిగిలి ఉన్నాయి. నేనెప్ప‌టికి ధైర్యం కోల్పోన‌ని మాట ఇస్తున్నా. ఈ విష‌యం విని మీరంతా షాక్ కు గురవుతారని తెలుసు. కాని ఏం ప‌ర్లేదు.

తొలి స్టేజ్ లోనే ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది’ అంటూ త‌హీరా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఆయుష్మాన్, త‌హీరాకి 2011లో వివాహం కాగా వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. మేరీ ప్యారీ బిందూ, దమ్ లగాకే హైసా, తుమారీ సులూ, అంధాదున్, బదాయి హో, నౌటంకీ సాలా, విక్కీ డోనర్ చిత్రాలతో ఆయుష్మాన్ ఖురానా పేరు తెచ్చుకున్నాడు.

More Telugu News