ap police: ఏపీ పోలీసు అధికారిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

  • నిజాంపేటలో ఓ ప్రైవేటు భూమి అమ్మకంలో అక్రమాలు
  • ఓ మహిళను భార్యగా చూపి భూమిని అమ్మిన వైనం
  • మహిళ భర్తపై కూడా దాడి చేసినట్టు ఆరోపణలు

ఏపీ పోలీసు అధికారిని హైదరాబాద్ శివారు బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిజాంపేటలో ఓ ప్రైవేటు భూమి అమ్మకంలో పోలీసు అధికారి నాగదుర్గా ప్రసాద్ అక్రమానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఓ మహిళను తన భార్యగా చూపి భూమిని అమ్మేశారని తేల్చారు. సదరు మహిళ భర్తపై కూడా దాడి చేసినట్టు ప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నాగదుర్గా ప్రసాద్ ను తిరుపతిలో అరెస్ట్ చేసిన పోలీసులు బాచుపల్లికి తరలించారు. 

More Telugu News