Baby: పల్లె గాయని పసల బేబీకి విరాళాల వెల్లువ... అమెరికా వెళ్లే చాన్స్!

  • సెలబ్రిటీగా మారిన పసల బేబీ
  • చిరంజీవి నుంచి రూ. లక్ష విరాళం
  • తాజాగా హైదరాబాద్ లో రూ. 1,11,111 విరాళం
  • శిక్షణ ఇచ్చి అమెరికా తీసుకెళ్లనున్న కోటి

సామాజిక మాధ్యమాల పుణ్యమాని రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయిన పల్లె గాయని పసల బేబీకి ఇప్పుడు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాడిన "ఓ చెలియా నా ప్రియ సఖియా" అనే పాటకు ఆస్కార్ అవార్డు విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సైతం ప‌ర‌వ‌శించి ప్రశంసల వర్షం కురిపించాడు.

నిత్యమూ కూలి ప‌నులకు వెళ్లి పొట్టపోసుకునే బేబీ, ఇప్పుడు ఓ సెల‌బ్రిటీ అయింది. ఆమెకు చిరంజీవి ఇటీవల రూ. లక్ష విరాళం ఇవ్వగా, మిర్రర్స్ బ్యూటీ సెలూన్ తరఫున పట్టు చీరలు, రూ. 30 వేలు విరాళం అందింది. ఇటీవల ఆమెను హైదరాబాదుకు పిలిపించిన సంగీత దర్శకుడు కోటి.. గీతామాధురి, కేథరిన్ థ్రెసా తదితరుల సమక్షంలో రూ. 1,11,111 విరాళాన్ని అందించారు. ఆమెకు శిక్షణ ఇస్తున్నానని, త్వ‌ర‌లో అమెరికా, దుబాయ్ లలో జరిగే సంగీత ప్రదర్శనల్లో తనతో పాటు పాల్గొంటుందని తెలిపారు.

 కాగా, డిసెంబ‌ర్ 5 త‌ర్వాత ఏఆర్ రెహ‌మాన్‌ ని కూడా బేబీ కలవనుందట. తనకు ఇంత పాప్యులారిటీ రావడంపై ఆమె ఎంతో ఆనందంగా ఉందిప్పుడు.

More Telugu News