Telangana: ఖమ్మం జిల్లా టీడీపీ సీనియర్ నేత తక్కెళ్లపాటి కన్నుమూత!

  • అనారోగ్యంతో బాధపడుతున్న నేత
  • చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి
  • కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన తుమ్మల

ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత తక్కెళ్లపాటి రాధా కృష్ణమూర్తి(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ నిన్న అర్థరాత్రి ప్రాణాలు కోల్పోయారు. రాధా కృష్ణమూర్తి మరణం గురించి తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హుటాహుటిన వేంసూరుకు చేరుకున్నారు. రాధాకృష్ణమూర్తి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తుమ్మల.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

More Telugu News