Suhasini Nandamuri: నందమూరి సుహాసినికి మద్దతు తెలిపిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు!

  • సుహాసినికి మద్దతు తెలిపిన ఓయూ, జేఎన్టీయూ జేఏసీ నాయకులు
  • ప్రజా కూటమి గెలుపు కోసం పోరాడుతామని వాగ్దానం
  • సమస్యల పరిష్కారంలో ముందుంటానని సుహాసిని హామీ

కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, టీఎస్ జేఏసీ, జేఎన్టీయూ జేఏసీ నాయకులు తమ పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కరపత్రాలను ఇంటింటికి పంచి ప్రజా కూటమి గెలుపు కోసం పోరాడుతామని జేఏసీ నాయకులు వాగ్దానం చేశారు. కాగా, నియోజకవర్గ సమస్యలు, మహిళల కష్టాల పరిష్కారంలో ముందుంటానని హామీ ఇస్తూ సుహాసిని తన ప్రచారంతో ముందుకు కొనసాగుతున్నారు.

More Telugu News