Andhra Pradesh: రేపు కాకినాడలో‘వంచనపై గర్జన’ బహిరంగ సభ.. పాల్గొననున్న వైఎస్ జగన్!

  • ప్రత్యేకహోదా, విభజన హామీల కోసం సభ
  • కేంద్రం, ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్న వైసీపీ అధినేత
  • ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రేపు ‘వంచనపై గర్జన’ బహిరంగ సభను వైసీపీ నిర్వహించనుంది.

‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో రేపు ఉదయం 9 గంటలకు కాకినాడలోని బాలాజీ చెరువు సెంటర్ లో సభను నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత జగన్ ఈ సభకు హాజరై ప్రసంగించనున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

More Telugu News