2.0: అయ్యో... నేను మిస్ అయిపోయాను: హీరో నాని

  • నేడు విడుదలైన రజనీ '2.ఓ
  • తలైవర్ వచ్చినా మిస్ అయ్యాను
  • తొలి ఆట చూడలేదన్న నాని

బాక్సాఫీసు ముందుకు తలైవర్ వస్తే తాను మిస్ అయిపోయానని హీరో నాని వ్యాఖ్యానించాడు. రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ తదితరులు నటించగా, శంకర్ దర్శకత్వంలో తయారైన '2.ఓ' ఈ ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు తొలి ఆట సమయానికి తాను షూటింగ్ కోసం వెళ్లాల్సి వచ్చిందని తన ట్విట్టర్ ఖాతాలో వాపోయాడు నాని. తీరిక దొరికిన వెంటనే తాను సినిమా చూసేందుకు వెళ్తానని చెప్పాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్టులు వస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News