Smriti Z Irani: నుదుట సిందూరం గురించి ప్రశ్నించిన ట్విట్టర్ యూజర్.. ఘాటుగా బదులిచ్చిన మంత్రి స్మృతి ఇరానీ

  • నేను హిందువును
  • నా భర్త, పిల్లలు జొరాష్ట్రియన్లు
  • నాకు గోత్రం లేదు.. మీరెవరో తెలుసుకోండి

తాను నుదుటన పెట్టుకునే సిందూరం గురించి ప్రశ్నించిన ఓ ట్విట్టర్ యూజర్‌కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గట్టిగా బదులిచ్చారు. తన గోత్రం కౌశల్ అని, అది తన తాత ముత్తాల నుంచి వస్తోందని పేర్కొన్నారు. తన  భర్త, పిల్లలు జొరాష్ట్రియన్లు అని, కాబట్టి తనకు గోత్రం లేదని వివరించారు. ఇక తాను హిందువును కాబట్టే విశ్వాసంతో సిందూరాన్ని ధరిస్తానని పేర్కొన్నారు. తన గురించి పూర్తిగా చెప్పానని, ఇక మీరెవరో మీరు తెలుసుకోవాలని ఘాటుగా బదులిచ్చారు.

రితురాజ్ కొన్వర్ అనే ట్విట్టర్ యూజర్ మంత్రి స్మృతిని ఉద్దేశించి.. ‘‘నేను మీ గోత్రాన్ని తెలుసుకోవచ్చా?  అలాగే, మీ భర్త, పిల్లల గురించి కూడా. మీరు నుదుటన ధరించే సిందూరం మతపరమైనదా? లేక స్టైల్ కోసమా? అని ప్రశ్నించాడు. అతడి ట్వీట్‌కు స్పందించిన మంత్రి స్మృతి ఇరానీ పై విధంగా బదులిచ్చారు.

More Telugu News