chandramukhi: గోషామహల్ అభ్యర్థి చంద్రముఖి మిస్సింగ్ కేసు.. హైకోర్టులో పిటిషన్!

  • మంగళవారం తెల్లవారుజాము నుంచి కనిపించకుండా పోయిన చంద్రముఖి
  • పోలీసులకు సవాల్ గా మారిన మిస్సింగ్ కేసు
  • చంద్రముఖిని కోర్టులో ప్రవేశపెట్టే విధంగా పోలీసులను ఆదేశించాలంటూ ఆమె తల్లి పిటిషన్

హైదరాబాదు గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ట్రాన్స్ జెండర్ చంద్రముఖి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆమెను కిడ్నాప్ చేశారని కూడా భావిస్తున్నారు. సోమవారం రాత్రి తన సన్నిహితులతో పాటు ఇంట్లో ఉన్న ఆమె.... తెల్లవారుజాము నుంచి కనిపించకుండా పోయారు.

 ఆమె మిస్సింగ్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆమె అదృశ్యానికి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. ట్రాన్స్ జెండర్ పోటీ చేయడాన్ని తట్టుకోలేక ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. మరోవైపు, ఆమె తల్లి ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రముఖి ఎక్కడ ఉన్నా కోర్టులో ప్రవేశపెట్టే విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు.

More Telugu News