rajanikanth: మహేశ్ బాబు రికార్డును తుడిచేస్తున్న '2.ఓ'

  • శంకర్ దర్శకుడిగా '2.ఓ'
  • రేపే భారీస్థాయిలో థియేటర్లకు 
  • కొత్త రికార్డులకు తెరలేచినట్టే  

శంకర్ దర్శకత్వంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన '2.ఓ' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఒక వైపున రజనీ అభిమానులు .. మరో వైపున అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను పది వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.

'2.ఓ' ను హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మాక్స్ లో తొలి రోజున 35 షోలు ప్రదర్శించనున్నారు. ప్రసాద్ ఐ మ్యాక్స్ లో ఇంతవరకూ అత్యధిక షోలు ప్రదర్శించబడిన చిత్రంగా 'బిజినెస్ మేన్' వుంది. అప్పట్లో పూరి .. మహేశ్ బాబుకి గల క్రేజ్ కారణంగా ఐ మ్యాక్స్ లో తొలి రోజున 'బిజినెస్ మేన్' 33 షోలను ప్రదర్శించారు. 7 సంవత్సరాలుగా మహేశ్ బాబు పేరు మీద నిలకడగా వున్న ఆ రికార్డును తాజాగా '2.ఓ' సినిమా తుడిచేయనుంది. 600 కోట్ల ఖర్చుతో నిర్మించిన '2.ఓ' మరిన్ని రికార్డులను సొంతం చేసుకుంటూ దూసుకెళ్లడం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.    

More Telugu News