mehreen: మెహ్రీన్ కూడా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట!

  • పులివాసు దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ 
  • ముందుగా సుధీర్ బాబుతో అనుకున్న కథ 
  • అప్పుడు ఓకే చెప్పిన మెహ్రీన్    

పులి వాసు దర్శకత్వంలో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఒక సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాను ముందుగా సుధీర్ బాబుతో చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఆయన జోడీగా మెహ్రీన్ ను కూడా తీసుకున్నారు.

అయితే కొన్ని కారణాలవలన ఈ ప్రాజెక్టు నుంచి సుధీర్ బాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. తీసుకున్న అడ్వాన్స్ ను కూడా ఆయన తిరిగిచ్చేశాడనే వార్తలు వచ్చాయి. ఇక మెహ్రీన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందనేది తాజా సమాచారం. మెహ్రీన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనేది హాట్ టాపిక్ గా మారింది. పెద్ద ఆఫర్ రావడం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కొందరు అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆమె చేసిన 'ఎఫ్ 2' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ఆశలన్నీ ఆ సినిమా పైనే వున్నాయి.    

More Telugu News