Mumbai: మందు కొట్టి కారు నడుపుతూ అడ్డంగా బుక్కయిన నటి గాయత్రీ రఘురాం!

  • చెన్నైలో సినీ ప్రముఖుల పార్టీ
  • పార్టీలో పూటుగా మందు కొట్టిన గాయత్రి
  • కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు

ప్రముఖ నటి, నృత్య కళాకారిణి, బిగ్ బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కయింది. ఈ విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో సినీ సెలబ్రిటీలు పాల్గొన్న ఓ పార్టీకి వెళ్లిన ఆమె, తిరిగి వస్తున్న వేళ, అభిరామపురం ట్రాఫిక్ పోలీసులు, చెక్ పాయింట్ వద్ద మందు బాబుల కోసం తనిఖీలు చేపట్టారు.

అదే సమయంలో అటుగా వచ్చిన గాయత్రి కారును ఆపి, బ్రీత్ అనలైజర్ లోకి గాలిని ఊదాలని కోరగా, ఆమె తాను ఆల్కహాల్ తీసుకున్నట్టు అంగీకరించింది. ఆపై పోలీసులు ఆమెకు తనిఖీలు చేసి, మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్టు తేల్చి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె బీఏసీ 185 రావడం గమనార్హం.

గాయత్రీ రఘురాంను కారులో చూడటంతో ఆ ప్రాంతమంతా ప్రజలు, అభిమానులతో నిండిపోయింది. చుట్టూ హడావుడి పెరుగుతూ ఉండటంతో, ఆమెను ఇంటివరకూ దింపాలని నిర్ణయించుకున్నామని, ఆపై ఆమె వాహనం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఏదైనా మొబైల్ కోర్టులో ఆమె రూ. 3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని అన్నారు.

More Telugu News