2.0: ఈ సినిమా త్రీడిలో చూస్తే అదిరిపోతుంది: '2.0' ప్రీరిలీజ్ ఫంక్షన్ లో రజనీకాంత్

  • '2.0' చిత్రంలో టెక్నాలజీ, త్రీడీ, కథల కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది
  • 45 శాతం వరకు గ్రాఫిక్స్ ఉంటాయి
  • ఈ సినిమా కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా

'2.0' చిత్రంలో టెక్నాలజీ, త్రీడీ, కథల కాంబినేషన్ అద్భుతంగా ఉందని... అందువల్ల ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే నమ్మకం తనకుందని రజనీకాంత్ అన్నారు. ఈ సినిమాకు ప్రమోషన్ అవసరం కూడా లేదని చెప్పారు. హైదరాబాదులో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.

ఈ చిత్రంలో 45 శాతం వరకు గ్రాఫిక్స్ ఉంటాయని... అందువల్ల సినిమా ఎలా వచ్చిందో తనకు కూడా తెలియదని... తాను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. దర్శకుడు శంకర్ చెప్పినట్టు ఈ సినిమాను త్రీడీలో చూస్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని తెలిపారు. 

More Telugu News