IndVAUS: కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ లు సాధించిన కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్!

  • మూడో స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
  • బ్యాటింగ్ విభాగంలో 11వ స్థానంలో శిఖర్ ధావన్
  • కోహ్లీ ర్యాంకింగ్ (14వ స్థానం)లో మార్పు లేదు

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత జట్టు నుండి కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్ లు కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ లని సాధించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించడంతో మెరుగైన స్థానాలకు చేరుకున్నారు. 20 స్థానాలు ఎగబాకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో నిలవగా, ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ లో 11వ స్థానంలో నిలిచాడు. కెప్టెన్ కోహ్లీ ర్యాంకింగ్ (14వ స్థానం)లో ఎలాంటి మార్పు లేదు.

కాగా, ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంక్ లలో పాకిస్తాన్ కి చెందిన బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్ఘానిస్తాన్ కి చెందిన రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే, ఆల్ రౌండర్ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్ వెల్ మొదటి స్థానంలో నిలిచాడు.

More Telugu News