akash puri: పూరి తనయుడి రెండో సినిమాలో కొత్త హీరోయిన్

  • పూరి నిర్మాతగా ఆకాశ్ మూవీ 
  • మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  • త్వరలోనే సెట్స్ పైకి  

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం తండ్రీకొడుకులిద్దరినీ నిరాశపరిచింది. ఈ సినిమా తెచ్చిన నష్టాలను లెక్కచేయకుండా ఆకాశ్ హీరోగా మరో సినిమాను చేయడానికి పూరి రెడీ అవుతున్నాడు. ఆయన ఈ సినిమాకి నిర్మాతగానే వ్యవహరించనున్నాడు.పూరి కథాకథనాలను అందించిన ఈ సినిమాకి అనిల్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించారు. చివరిగా గాయత్రి భరద్వాజ్ ను ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమాతోనే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయం కానుంది. మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. హీరోగా ఈ సినిమా ఆకాశ్ కి మంచి బ్రేక్ ను ఇస్తుందని పూరి భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

More Telugu News