kukatpalli: కూకట్ పల్లిలో టీఆర్ఎస్ కే మద్దతు అంటున్న వైసీపీ నేతలు!

  • తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ సింగిల్ గా వస్తున్నారు 
  • వైయస్ ఫొటో పెట్టుకోవడానికి కాంగ్రెస్ కు అర్హత లేదంటూ మండిపాటు 
  • తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ వస్తారంటూ ఆశాభావం

కూకట్ పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి వైసీపీ నేతలు మద్దతు పలికారు. టీఆర్ఎస్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింహం సింగిల్ గా వస్తుందని... తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ సింగిల్ గా వస్తున్నారని చెప్పారు. మహాకూటమిని ఓడించాలని కోరారు.

కాంగ్రెస్ బ్యానర్లపై వైయస్ ఫోటో పెట్టుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్ బొమ్మ పెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలకు అర్హత లేదని అన్నారు. వైఎస్ ను అవినీతిపరుడు, దొంగ అని కాంగ్రెస్ వాళ్లు ఆరోపించారని మండిపడ్డారు. మహాకూటమి తరపున రాహుల్ గాంధీ, చంద్రబాబులు ప్రచారానికి రాబోతున్నారని... వైయస్ పై వారి అభిప్రాయం ఏమిటో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. జై కేసీఆర్, జై జగన్, జై కేటీఆర్, జోహార్ వైయస్సార్ అంటూ నినాదాలు చేశారు.

More Telugu News