Jagan: జగన్‌కు వెయ్యి కార్లతో స్వాగతం పలకనున్న శ్రీకాకుళం నేతలు

  • నేడు శ్రీకాకుళం జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశం
  • ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని పిలుపు
  • వచ్చే నెల 3న రాజాంలో ముగింపు

విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగించుకుని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వెయ్యి కార్లతో స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రానికి జగన్ పాదయాత్ర ముగియనుంది. అనంతరం వీరఘట్టం మండలంలోని కెళ్ల గ్రామానికి జగన్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని, వెయ్యి కార్లతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలో నేడు ప్రారంభం కానున్న యాత్ర వచ్చే నెల 3న రాజాంలోని బహిరంగ సభతో ముగియనుందని తెలిపారు.

More Telugu News