2.0: రజనీకాంత్ '2.0'పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

  • పెద్ద దర్శకుడు చిన్న పిల్లల కోసం తీసిన సినిమా '2.0'
  • చిన్న పిల్లోడు పెద్దవాళ్ల కోసం తీసిన చిత్రం 'భైరవగీత'
  • ఏ చిత్రానికి కావాల్సిన ఆడియెన్స్ ఆ చిత్రానికి ఉన్నారు

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్లో తెరకెక్కిన '2.0' చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా 6,800 స్క్రీన్లపై ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం రికార్డు స్థాయిలో రూ. 370 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని చెబుతున్నారు.

మరోవైపు ఈ చిత్రంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా పెద్ద డైరెక్టర్ చిన్న పిల్లల కోసం తీసిన సినిమా '2.0' అంటూ ట్విట్టర్ ద్వారా విమర్శించారు. 'భైరవగీత' చిత్రాన్ని ఓ చిన్నపిల్లోడు పెద్దవాళ్ల కోసం తీసిన సినిమా అని చెప్పాడు. 'భైరవగీత' చిత్రం రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కింది. ఈనెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయని... ఏ చిత్రానికి కావాల్సిన ఆడియెన్స్ ఆ చిత్రానికి ఉన్నారంటూ రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ చేసుకునే పనిలో పడ్డారు.

More Telugu News